13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఏకశిలా పార్క్ వాకర్స్ నూతన కమిటీ

13-01-2026 11:41 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బాలసముద్రంలోని ఏకశిల పార్కు వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పడాల సోమయ్య, ఈసీ మెంబర్లుగా కుందారపు అరుణ, పట్నంశెట్టి సుమతి ఎన్నుకోగా మిగతా పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా బోనాల వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా చెన్నం రవీందర్రెడ్డి, కోశాధికారిగా బిల్లా రాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా దేశిని సిద్ధార్థ గౌడ్ ఎన్నుకున్నారు. మొత్తం 725 సభ్యులకు 600 మంది సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించు కున్నట్లు ఎన్నికల అధికారి లెక్కల జలేందర్ రెడ్డి తెలిపారు. గెలుపొందిన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షు డిగా వంగా రాజిరెడ్డి, ప్రధాన సలహాదారుడిగా పచ్చిమట్ల ఎల్లగౌడ్ నియమించినట్లు తెలిపారు. ఈసందర్భంగా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాల తమ పదవికాలంలో పార్కు అభివృద్ధికి, అసొసియేషన్ సభ్యుల సంక్షేమానికి, సామాజిక కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.