calender_icon.png 8 January, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలమంచి తండా సర్పంచ్ వినూత్న ఆలోచన

06-01-2026 05:25:58 PM

ఇందిరమ్మ చీరల విశిష్టతను చాటిచెప్పిన సర్పంచ్ బద్రునాయక్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామ సర్పంచ్ బానోతు బద్రునాయక్ వినూత్న ఆలోచన చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకానికి ఉన్న విశిష్టతను చాటిచెబుతూ, ఎలమంచిలి తండా సర్పంచ్ బానోతు బద్రునాయక్ ఆధ్వర్యంలో 200 మంది మహిళలు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అందిస్తున్న ఈ అందమైన చీరలను ధరించి, ఒకే రకమైన వేషధారణలో మహిళలు ఐక్యంగా స్వామివారిని సందర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకం పట్ల గౌరవాన్ని, ఇందిరమ్మ చీరల ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే సర్పంచ్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలంతా ఆత్మగౌరవంతో, ఒకే శోభతో ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని రేవంత్ రెడ్డి పాలనకు కృతజ్ఞతలు తెలిపారు.