22-05-2025 11:13:47 AM
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కిష్టావార్లో పోలీసులు, బలగాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సింఘ్పొరాలో ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. బలగాలు నలుగురు టెర్రరిస్టులను చుట్టుముట్టాయి. భద్రత బలగాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అదనపు దళాలను మోహరించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.
నివేదికల ప్రకారం, ఇద్దరు నుండి ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నారని తెలుస్తోందన్నారు. గత వారం మంగళవారం, గురువారం వరుసగా పుల్వామాలోని షోపియన్లోని కెల్లర్ ప్రాంతంలో త్రాల్లోని నాదర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత 26 మంది పౌరులు కాల్చి చంపబడిన తరువాత భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్ ప్రాంతాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఉగ్రవాదంపై చర్యలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్లను కూడా భారత సైన్యం కూల్చివేసింది.