ఘనంగా ఇంజనీర్స్ డే
కోదాడ,(విజయక్రాంతి): విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను సాధించాలని కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(Kodada KITS Engineering College) మేనేజ్మెంట్ రిప్రెసెంటేటివ్ నీలా బిందు పావని అన్నారు. కిట్స్ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(Mokshagundam Visvesvaraya Jayanti) సందర్భంగా ఇంజనీర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించి మాట్లాడారు.
భారతదేశంలో నేటికీ చెక్కుచెదరని ఆనకట్టలు, వంతెనలు కట్టి భావిభారత ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇచ్చిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని అతని మేధాశక్తిని స్మరించారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని భావి భారత ఇంజనీర్లుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, కళాశాల డైరెక్టర్ ఉమారాణి, వివిధ విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజి, లక్ష్మణ్ అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.