08-01-2026 12:30:17 AM
జవహర్నగర్, జనవరి 7,(విజయక్రాంతి): ప్రజల ముంగిటికే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలాలు లభిస్తాయని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్సి శ్రీకాంత్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వారాంతపు కూర గాయల సంతను శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో శ్రీకాంత్ చారి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ మార్కె ట్ను ఏర్పాటు చేశామని, ప్రతి వారం జరిగే ఈ సంతను, లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలతోపాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలే కాకుం డా జవహర్నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ముఖ్యులు, నాయ కులు మూకర రవి, రంగుల హరికృష్ణ, ఎం. లక్ష్మీనారాయణ, రంగుల శంకర్, జి. నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, నగేష్, సుజాత, జ్యోతి, తదితరులు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.