6 May, 2026 | 10:16 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు

08-01-2026 12:30 AM

జవహర్‌నగర్, జనవరి 7,(విజయక్రాంతి): ప్రజల ముంగిటికే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలాలు లభిస్తాయని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్సి శ్రీకాంత్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వారాంతపు కూర గాయల సంతను శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో శ్రీకాంత్ చారి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ మార్కె ట్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి వారం జరిగే ఈ సంతను, లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలతోపాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలే కాకుం డా జవహర్‌నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ముఖ్యులు, నాయ కులు మూకర రవి, రంగుల హరికృష్ణ, ఎం. లక్ష్మీనారాయణ, రంగుల శంకర్, జి. నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, నగేష్, సుజాత, జ్యోతి, తదితరులు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.