calender_icon.png 17 January, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి

17-01-2026 03:23:40 AM

  1. ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 
  2. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న సీఎం

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : తెలంగాణకు గత పదేళ్లలో ఒక్క సైనిక్ స్కూ ల్ ఇవ్వలేదని, అందుకు ఇప్పుడు రాష్ట్రం లో సైనిక్  స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని కూడా హైదరాబాద్‌కు మా ర్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  ‘సివిల్ మిలిటరీ లైజ న్ కాన్ఫరెన్స్’ జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా(తెలంగాణ  సబ్ ఏరి యా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూసమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ప్రధాన చర్చ జరిగింది. సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువె ళ్లారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లో లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభు త్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీవైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం కోరా రు. నిరంతరం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.