calender_icon.png 11 August, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలి

11-08-2025 04:39:58 PM

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలసాని తిరుపతిరావు..

చిట్యాల (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలసాని తిరుపతిరావు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన తిరంగా ర్యాలీలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో కలిగివుండి, ధర్మం వైపు పయనించాలని సూచించారు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి మనకు స్వాతంత్రం కలుగజేశారని గుర్తు చేశారు.

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని, యువత  చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు సోదరా భావంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు, బుర్ర వెంకటేష్ గౌడ్, మైదం శ్రీకాంత్, తీగల జగ్గయ్య, సుదగాని శ్రీనివాస్ , గుండ సురేష్ ,మందల మొగిలి, గజనాల రవీందర్, చింతల రాజేందర్, మార్తా అశోక్,  కదం రాజు, తీగల వంశీ ,నీలి సుధాకర్ రెడ్డి, సాదా సాదానందం, బుర్ర ఆభిజ్ఞ,బుర్ర వితేష్, గోల్కొండ అజయ్, తదితరులు పాల్గొన్నారు.