calender_icon.png 20 June, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

10-06-2025 12:37:37 AM

బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

యాచారం జూన్ 9:  ప్రతిఒక్కరూ ఆధ్యా త్మి క చింతన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.సోమవారం యాచారం మండలం, తమ్మలోని గూడ గ్రామం లో బీరప్ప కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి ఒక్క రూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో. పెద్ద కురుమ  కర్రెరాజు,సెలోజి కాలే శివయ్య, పెద్ద గొల్ల పాల శ్రీశైలం, ఆలయ చైర్మన్ కర్రే బుచ్చయ్య, మాజీ సర్పంచ్ కాలే సంతోష మల్లేష్, తదితరులుపాల్గొన్నారు.