17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళా పెట్రోల్ బంక్ ట్రయల్ సేల్ పరిశీలన

10-06-2025 12:36 AM

సంగారెడ్డి, జూన్ 9(విజయక్రాంతి): జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోలు బంకును నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పెట్రోల్ బంక్ మొట్ట మొదటిసారిగా మహిళల చేత నడిపించబడుతుందన్నారు.

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో షెట్రోలు బంకు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందిదని, మొత్తం 14 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, అందులో ఇద్దరు మహిళలు మేనేజర్లుగా, పన్నెండు మంది మహిళలు ఆపరేటర్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

త్వరలోనే పెట్రోల్ బంకుకు సెక్యూరిటీ నియమిస్తామన్నారు. ట్రయ ల్ సేల్ అనంతరం వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా  కలెక్టర్ వాహనంలో డీజిల్ డీజిల్ పోయించుకొని తన సొంత డబ్బులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీ డిఆర్డిఒ జ్యోతి,  అదనపు డిఆర్డిఒ జంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.