calender_icon.png 20 June, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి

10-06-2025 12:38:20 AM

దౌల్తాబాద్, జూన్ 9: ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని గజ్వేల్ ఏసిపి నర్సింలు అన్నారు. సోమవారం  దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు ఉదయం సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహించి హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.  విపిఓ వ్యవస్థను మెరుగుపరచాలని వారంలో రెండు మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి సూచించారు.  తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్, రాయపోల్ ఎస్త్స్రలు శ్రీరామ్ ప్రేమ్ దీప్, రఘుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.