03-12-2025 05:49:32 PM
తాండూరు (విజయక్రాంతి): దివ్యాంగులను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎంఈఓ నరేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు. దివ్యాంగుల చట్టాలపై అవగాహన కల్పించి భవితా కేంద్రాల ద్వారా వారికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు. క్రీడ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబా ఉపాధ్యాయులు గురు చరన్ తదితరులు ఉన్నారు.