10 March, 2026 | 2:04 PM

నల్గొండలో రోడ్డుప్రమాదం: ఇద్దరు డ్రైవర్లు మృతి

10-03-2026 10:59 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్(Narketpally Flyover) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓవర్ టేక్ చేస్తూ ట్రావెల్స్ బస్సు లారీని తాకుతూ ముందుకెళ్లింది. అనంతరం లారీ, ట్రావెల్స్ బస్సును రహదారి పక్కన ఆపి డ్రైవర్లు ఘర్షణకు దిగారు. లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా వేగంగా దూసుకొచ్చిన మరోలారీ వారిని వెనుకనుండి ఢీకొట్టింది.

రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.