26 April, 2026 | 10:43 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఇరాన్ యుద్ధ ప్రభావం.. దేశంలో గ్యాస్ సంక్షోభం!

10-03-2026 12:46 PM

న్యూఢిల్లీ: ఇరాన్(Iran war)పై ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం(Gas Crisis) నెలకొంది. దేశంలో గ్యాస్(India Gas Crisis) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకుంది. 

వంట గ్యాస్‌కే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వంద శాతం గృహ ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పీఎన్ జీ, సీఎన్ జీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఎరువుల ప్లాంట్లకు 70 శాతం, పరిశ్రమలకు 80 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టుంది.


ఇవి కూడా చదవండి:

22 ఏళ్లుగా ‘నో స్మోకింగ్’ పోరాటం.. రఘునందన్‌కు జాతీయ హీరో అవార్డు

తెలంగాణ బడ్జెట్ 2026-27.. రూ.3.25 లక్షల కోట్లకు చేరే అవకాశాలు

నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి