దేశంలో గ్యాస్ కొరత.. అమల్లోకి అత్యవసర వస్తువుల చట్టం
న్యూఢిల్లీ: ఇరాన్(Iran war)పై ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం(Gas Crisis) నెలకొంది. దేశంలో గ్యాస్(India Gas Crisis) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకుంది.
వంట గ్యాస్కే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వంద శాతం గృహ ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పీఎన్ జీ, సీఎన్ జీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఎరువుల ప్లాంట్లకు 70 శాతం, పరిశ్రమలకు 80 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టుంది.




