26-06-2025 09:10:39 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్(Mother Teresa Charitable Trust) ఆధ్వర్యంలో మండలంలోని సారపాక గ్రామంలోని బ్రిలియంట్ కళాశాల నందు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బూర్గంపాడు ఎస్ఐ నాగ బిక్షం పాల్గొని మాట్లాడుతూ... డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండ కోరారు. మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిసైన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరారు. ముఖ్యంగా సమాజంలో మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదని అన్నారు.
డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయన్నారు. డ్రగ్స్కు, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా విద్యార్థులు యువత ప్రజలు డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కళాశాల చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ బిఎన్ఆర్, కళాశాల అధ్యాపకులు కార్తీక్, వరప్రసాద్, నరేష్, లక్ష్మీనారాయణ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి, బూరం నవీన్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.