26-06-2025 09:42:08 PM
జైపూర్ (విజయక్రాంతి): జైపూర్ మండలంలోని వేలాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంథని శ్రీ సీతా రామ సేవా సదన్(Sri Sita Rama Seva Sadan) ఆధ్వర్యంలో గురువారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు సేవ సదన్ వ్యవస్థాపకులు గట్టు నారాయణ స్వామి, అధ్యక్షులు హరి బాబులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, సేవా సదన్ సభ్యులు శ్రీకాంత్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.