calender_icon.png 27 June, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

26-06-2025 09:42:08 PM

జైపూర్ (విజయక్రాంతి): జైపూర్ మండలంలోని వేలాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంథని శ్రీ సీతా రామ సేవా సదన్(Sri Sita Rama Seva Sadan) ఆధ్వర్యంలో గురువారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు సేవ సదన్ వ్యవస్థాపకులు గట్టు నారాయణ స్వామి, అధ్యక్షులు హరి బాబులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, సేవా సదన్ సభ్యులు శ్రీకాంత్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.