15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

14-06-2025 12:00 AM

యాదాద్రి భువనగిరి జూన్ 13 ( విజయ క్రాంతి ): ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా శుక్రవారం నాడు మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ  బాల కార్మిక చట్టాల గురుంచి మరియు కర్మగారాలు ఫ్యాక్టరీ . హోటల్స్. కిరాణషాపులు.ఇటుకబట్టీలు. కోళ్ల ఫారాల లో  18 సంవత్సరాల లోపు బాలలను పను లలో పెట్టుకున్నట్లయితే యాజమ నులపై   కేసులు నమోదు అవుతాయని. ఒకవేళ పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే రెండు సంవత్సరాల జైలు శిక్ష 50 వేల రుపాయాల జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం జిల్లా సంక్షేమ అధి కారి  నరసింహ రావు  ర్యాలీలో పాల్గొని  షాపు యజమానులు బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం లో  డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, డి ఐ ఈ ఓ రమణీ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి , సిడీపిఓ శైలజ, ఏ ఎల్ ఓ మోయిజుద్దీన్ , జిల్లా బాలల పరిరక్షణ విభాగం ,సఖీ విభాగం డిఎల్‌ఎస్‌ఏ సిబ్బంధి,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంధి , స్కోప్ ఎన్జిఓ , అంగన్వాడీ టీచర్లు ,విద్యాశాఖ సిబ్బంధి , విద్యార్ధులు పాల్గొన్నారు.