14-06-2025 12:00:00 AM
గద్వాల, జూన్ 13 ( విజయక్రాంతి ) : రైతుల భాదలు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ దృష్టికి బి ఆర్ ఎస్ పార్టీ తరుపున చెప్పడానికి వెళ్ళితే అరెస్టులు చేస్తారా అని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్ కుమార్ మండి పడ్డారు. శుక్రవారం గద్వాల మండలం పూటన్ పల్లి గ్రామంలో రైతుల సమస్య లను తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రాం, కమిటీ సభ్యులు రావడం జరిగింది.
రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కుర్వ విజయ్ కుమార్ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. గతవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో రైతు సంక్షేమ కమిషనర్ ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని డకుర్వ విజయ్ కుమార్ వివరించడం జరిగిందని అందుకు స్పందించి శుక్రవారం కమిషన్ సభ్యులు గద్వాల జిల్లా కు రావడం జరిగిందని బి ఆర్ ఎస్ నాయకులు గుర్తు చేశారు.