15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలి

14-06-2025 12:00 AM

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి టౌన్ జూన్ 13: వనపర్తి జిల్లాలో భోజనం హోటళ్లలో చట్ట విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న కూడా కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్నారా? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను కలిసి అక్రమ మద్యం అమ్మకాలపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....భోజనం పేరుతో హోటళ్లు నడుపుతున్న కొందరు గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలను అక్రమంగా నిర్వహిస్తున్నారని,కట్టడి చేసి కఠిన చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పం దించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడుషా, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్ తదితరులు పాల్గొన్నారు.