23-04-2025 12:00:00 AM
మొరం రవాణా వెనుక కలెక్టర్ డ్రైవర్...?
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఎలాంటి అనుమతులు లేకుం డా పట్టపగలే మొరం తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. జిల్లా కేంద్రం నుండి కూతవేటు దూరంలో ఉన్న చిర్రకుం ట దారిలోని చల్ల మల్లన్న ఆలయ సమీపం లో అక్రమంగా మెరం తవ్వకాలు చేపడుతున్నారు.
అక్రమ మైనింగ్ చేస్తున్న సంబంధిత అధికారులు మామూలుగా తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛ గా మొరం రవాణా చేయడం వెనకాల ఓ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. పేద ప్రజలు ఒక ట్రాక్టర్ మట్టి అవసరం ఉండి కావాలం టే మైనింగ్ అధికారులు ఎన్నో షరతులుపెడతారు.
కానీ అక్రమంగా మైనింగ్ చేస్తూ మట్టి రవాణా చేస్తున్న వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పట్టపగలే రవా ణా చేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది. అడపాదడపా తనిఖీలు చేస్తు న్న అధికారులు చిన్నచిన్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ నాయకుల మద్దతు, అధికారుల అండదండలు ఉన్న వారు మాత్రం యేథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి రవాణా చేస్తున్న చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలాంటి అనుమతు లు లేకుండా మట్టి తవ్విన ఇతన్ని స్థానికులు అడ్డుకుంటే పోలీసులకు చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయి.
మొరం రవాణా వెనుక..?
అక్రమ మొరం తవ్వకాల వెనుక కలెక్టర్ డ్రైవర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొరం రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు సైతం ఇదే జవాబు చెప్పడం గమనార్హం. జిల్లా కలెక్టర్ వద్ద పనిచేస్తున్న ధీమాతో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.