23-04-2025 12:00:00 AM
ఆ ఊర్లో ఏముంది..? కథనానికి స్పందించిన ఏఎస్పీ చిత్తరంజన్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి): మూఢనమ్మకాలను వీడాలని ఏఎస్పీ చిత్తారంజన్ అన్నారు. ఈనెల 19న ఆ ఊర్లో ఏముంది...? విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. ఆసిఫాబాద్ మండ లం సముతులగుండం గ్రామా న్ని సీఐ రవీందర్తో కలిసి ఏఎ స్పీ చిత్తరంజన్ మంగళవారం సందర్శించారు.
గ్రామంలో నివసిస్తున్న ఆదివాసి కుటుంబాన్ని పరామర్శించి అక్కడ జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వలస వెళ్లిన 11 గిరిజన కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పట్ల భయాందోళనతో ఊరు వదిలి వెళ్ళిన వారిలో ఏఎస్పీ భరోసా నింపారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహిం చి, మందులు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.
నిత్యవసర సరు కులు అందజేశారు. గ్రామంలో తమకు రేషన్ కార్డు లేదని, పింఛన్ రావడంలేదని గిరిజనులు ఏఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పెన్షన్, రేషన్ కార్డు ఇప్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు.