20 March, 2026 | 10:47 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అతి చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం: కేటీఆర్

22-04-2025 05:55 PM

హైదరాబాద్: 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్(Telangana Bhavan) లో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ వ్యవహార శైలిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పుపట్టిందని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక తర్వాతైనా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుపట్టిందని, బాధ్యులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన వెల్లడించారు. బాధ్యులైన పోలీసులను తొలగించకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపివేయాలని, మూడేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమ వ్యక్తం చేశారు. అతి చేసే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ సూచించారు.