02-06-2025 05:39:41 PM
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్(Hanamkonda District Police Parade Ground) నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana State Formation Day) పురస్కరించుకొని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి జిల్లా ప్రగతి గురించి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. అనంతరం చిన్నారులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ఆదాలత్ జంక్షన్ లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర సిపి సన్ ప్రీత్ సింగ్, జిడబ్ల్యూఎంసి కమీషనర్ అశ్విని తానాజీ వాఖడే, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో...
సోమవారం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య(District Collector P. Pravinya) జాతీయ పథకాన్ని ఎగురవేశారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. త్రివర్ణ పథకం ఆవిష్కరణంతరం కలెక్టర్ మాట్లాడుతూ... స్వరాష్ట్రం సాధించేందుకు పోరాడిన అమరువీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదగా స్కౌట్స్, గైడ్స్ కు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వై.వి గణేష్, మేన శ్రీను, హనుమకొండ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ రాథోడ్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.