2 July, 2026 | 3:41 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

శ్రీకృపా ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అధ్యాపకురాలికి డాక్టరేట్ గౌరవం

21-01-2026 06:39 PM

సిద్దిపేట రూరల్: శ్రీకృపా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేటకు చెందిన బి. నాగరాణి డాక్టరేట్ పట్టా సాధించారు. గీతం విశ్వవిద్యాలయం నుండి ఆమె పీహెచ్‌డీ పూర్తిచేశారు. గీతం యూనివర్సిటీకి చెందిన డా. జి.వి. రాధా మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్.వై. మంజునాథ్, యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు డా. బి. నాగరాణిని అభినందించారు. ఆమె సాధించిన ఈ ఘనతతో సంస్థ ప్రతిష్ట మరింత పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పరిశోధనలు చేసి ఫార్మా స్యూటికల్ విద్యా రంగానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు