హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యా
ఆప్ అధినేత కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: 2020 ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన మూడు ప్రధాన హామీలను నెరవేర్చడంలో తాను విఫలం అయ్యాయని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. ఢిల్లీలో 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రధా న హామీలైన యుమునా నదిని శుభ్రపరచ డం, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీటిని అందించడం, ఢిల్లీ రోడ్లను యూరోపియన్ ప్రమాణాలకు మార్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
మొద టి రెండున్నర ఏండ్లు కోవిడ్, ఆ తరువాత ఆప్ మంత్రులు జైలుపాలు కావడంతో తాను ఈ మూడు హామీ లు నెరవేర్చలేకపోయానని పేర్కొన్నారు. తనను, ఆప్ను మరోసారి ఎన్నుకోవాలని ఢిల్లీ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయి తే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.






