18 July, 2026 | 12:22 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ మృతి

15-12-2024 01:16 AM

సుచిర్ బాలాజీ మరణంపై అనుమానాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్(ప్రజావేగు) సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భారత సంతతికి చెందిన బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్నారు. గతనెల 26న బాలాజీ చనిపోగా.. తాజాగా ఈ విషయం వెలుగుచూసింది. ప్రాథమిక విచారణ అనంత రం బాలాజీది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు.

ఘటన వద్ద ఎలాంటి అనుమానా స్పద వస్తువులు లభించలేదని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ చేస్తున్న ఆపరేషన్లు, ఆ సంస్థ అవలంబిస్తున్న విధానాలు ఆందోళనక రంగా ఉన్నాయని గతంలో తన పరిశోధనల ద్వారా బాలాజీ వెల్లడించారు. ఓపెన్ ఏఐ కాపీరైట్లను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన మూడు నెలల అనంతరం బాలాజీ మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.

బాలాజీ 2020 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు ఓపెన్ ఏఐ లో పనిచేశారు. సమాజానికి మేలుకంటే హాని చేసే టెక్నాలజీల కోసం తాను ఇక పనిచేయనని, అందుకే ఓపెన్ ఏఐను వీడానని గతంలో బాలాజీ న్యూయార్క్ టైమ్స్‌తో పేర్కొన్నారు.