22-06-2025 09:25:19 AM
7 వేలే ఇస్తావా ? ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ రైతును లంచం అడిగిన ఎమ్మార్వో రాజారావు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఒకవైపు ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తూ లంచాధికారులను వలపని పట్టుకుంటున్న, మరోవైపు అధికారులు బహిరంగంగా లంచాలు దండకుంటన్న వైనం వెలుగు చూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల( Aswapuram Mandal) తహసిల్దార్ రాజారావు ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ సెల్ఫోన్లో బందీ అయ్యాడు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్ లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. పేరు మార్పు జరగాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ తాసిల్దార్ డిమాండ్ చేశారు. దీంతో రైతు తన తనతో వచ్చిన మరో వ్యక్తి తో సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డ్ చేయిస్తూ లంచం ఇచ్చాడు. ఆ విషయం తెలియక తహసిల్దార్ రూ 7 వేలే ఇస్తారా, ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటూ లంచం రైతును అడగడం గమనార్హం. సదరు రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.