17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చేగుంటలో అమానవీయ ఘటన..!

22-06-2025 11:59 AM

చేతబడి చేశాడని చెప్పుల దండ మెడలో వేసి ఊరేగింపు.

దళిత వ్యక్తికి ఘోర అవమానం.  ఆలస్యంగా వెలుగులోకి ఘటన.

 నాగర్ కర్నూల్, (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లాలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి చేశాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని చెప్పుల దండ మెడలో వేసి గ్రామంలో ఊరేగించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేత జరిపించిన ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఒక వ్యక్తిపై మరో వ్యక్తి తరచు అనారోగ్యానికి గురవుతుండడంతో బిజినపల్లి మండల కేంద్రంలో గద్దె చెప్పించుకున్నాడు.

నీకు చేతబడి చేశారని చెప్పడంతో చేగుంట గ్రామంలోని కృష్ణయ్య అనే వ్యక్తిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి చిత్ర హింసలకు గురి చేయడంతో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం  గ్రామస్తులంతా తమ ఎడమకాలు చెప్పులను దండగ చేసి మెడలో వేసి గ్రామంలో రెండు రౌండ్లు ఊరేగించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. కానీ విషయం జరిగింది వాస్తవమేనని ఇరువర్గాలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు మూఢనమ్మకాలతో అశాంతిని కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.