31-05-2025 03:13:04 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్తో హరీశ్రావు శుక్రవారం సుమారు మూడున్నర గంటలపాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమి షన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారని తెలుస్తోంది. కేవలం రాజకీయ కక్షతో నే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఆరోపణలు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీశ్రావు కాళేశ్వ రం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై ఈ సందర్భం గా వారు చర్చలు జరిపినట్టు సమాచారం.
కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ తప్పు పట్టడంపైనా ఈ చర్చలో ప్రస్తావించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, బరాజ్పై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్అండ్టీ వేసిన ప్రశ్నను కమిషన్ ఎదుట ప్రస్తావించాలని వీరివురు నిర్ణయించారని తెలుస్తోంది. ఎల్అండ్టీ లేఖతో ఎన్బీఎస్ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం.
ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ను కోరితే ఎలా ఉంటుందన్న అంశంపై నా చర్చించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బరాజ్లపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే.