28-06-2025 11:06:13 PM
దండేపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధిలు రైతుల ఖాతాల్లో జమ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంఅని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరై ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.... రైతులకు 9వేల కోట్ల రూపాయలు అందించడమే కాకుండా ఎల్లప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.