calender_icon.png 12 June, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాల బారినపడి రైతన్న మోసపోవద్దు

10-06-2025 10:52:03 PM

నకిలీ విత్తనాలు, పురుగు మందులపై విక్రయాలపై సమాచారం ఇవ్వండి..

నకిలీ విత్తనాలు పురుగుల మందులు విక్రయించి రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం..

ఏటూరునాగారం పోలీస్ శాఖ..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ఏటూరునాగారం పోలీస్ స్టేషన్(Eturnagaram Police Station) సర్కిల్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సిఐ రమేష్, ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్, ప్రజలకు రైతులకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ములుగు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం పోలీసులు స్థానిక మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ అధికారులు, రైతులకు నకిలీ విత్తనాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై  పోలీస్ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను, పురుగు మందులు విక్రయిస్తుతే పిడి యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరుగుతుందని. నకిలీ విత్తనాలను విక్రయాలను నియంత్రియించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని, పోలీస్  స్టేషన్ ల పరిధిలో  నిఘా పటిష్టం చేయడం జరిగిందన్నారు. ఇకపై ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా 100 ఫోన్ నంబరకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడుతుందని ఏటూరు నాగారం పోలీస్ శాఖ వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సిఐ రమేష్. ఎస్సై తాజుద్దీన్. వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.