25-06-2025 01:53:36 AM
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 24 ( విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. గత తొమ్మిది రోజుల్లో ఖరీఫ్ రైతు భరోసా కు సంబంధించి తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.
అంతకుముందు ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుమాసదే చరణ్, సీనియర్ నాయకులు చునర్కర్ వసంత్ రావు, మాజీ ఎంపీపీ బొమ్మన బాలేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ మలేష్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండీ.రఫిక్, యాత్ అధ్యక్షులు జి.శ్యామ్, మాజీ సర్పంచ్ దత్తు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అసద్, కలిమ్, చునర్కర్ దీపక్, జమిర్, మారిశెట్టి కృష్ణమూర్తి, కిరణ్, అశోక్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.