25-06-2025 01:53:49 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూన్ 24 (విజయక్రాంతి) : జపాన్ సకురా అంతర్జాతీయ సైన్స్ కార్యక్రమంలో జిల్లా విద్యార్థిని శ్రీవల్లి పాల్గొన డం అభినందనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తన చాంబర్ లో జాతీయ స్థాయి ఇన్స్ఫెయిర్ పోటీల్లో అద్భుత ప్రదర్శన అందించి రాష్ట్రపతి అభినందనలు పొంది అంతర్జాతీయ స్థాయి సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవల్లిని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబులతో కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థా యి సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవల్లి జపాన్లోని యూనివర్సిటీలు, అంతరిక్ష కేంద్రం, పాఠశాల, మ్యూజియంలను సందర్శించి విజ్ఞానాన్ని పొందిందని, ఆధునిక సాం కేతిక జ్ఞానాన్ని పొంది భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ‘ఇన్స్ఫెయిర్ అవార్డ్స్ మానక్‘, ఇన్స్ఫెయిర్ అవార్డుల కొరకు నామినేషన్ల సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.
విద్యార్థుల మేథ స్సుకు పదును పెట్టేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలలో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు భాగస్వాములు కావాలన్నారు.