09-06-2025 10:14:02 AM
హైదరాబాద్: న్యాయవ్యవస్థ, చట్టాల మీద బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. అందుకే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు(Kaleshwaram Commission Inquiry) హాజరవుతున్నామని వెల్లడించారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని హరీశ్ రావు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం కమిషన్ కు అందిస్తామన్నారు. ప్రభుత్వం వి ద్వేషంతో ఆలోచన చేయకూడదని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని హరీశ్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం మీద నమ్మకం ఉంది, అంతిమంగా న్యాయం గెలుస్తుందని చెప్పారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అనంతరం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కోసం హరీష్ రావు తెలంగాణ భవన్కు బయలుదేరారు.
తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11:30 గటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. విధానపర నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నించే అవకాశముంది. మేడిగడ్డ, అన్నాం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అవకతవకలపై విచారించనున్నారు. హరీశ్ రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం రీ-డిజైన్(Day Kaleshwaram Redesign) జరిగింది. ఇప్పటికే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది.