calender_icon.png 1 June, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ విద్యార్థులకు ఫీజుల గండం!

03-05-2025 12:00:00 AM

  1. సమీపిస్తున్న డిగ్రీ పరీక్షలు

పెండింగ్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు

ఒక్కో విద్యార్థి నుంచి పదివేల వరకు వసూళ్లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేద విద్యార్థులు

నాగర్ కర్నూల్ మే 2 (విజయక్రాంతి)వలసల జిల్లాగా పేరొంది న పాలమూరులో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గుదిబండగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యా ర్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం విద్యార్థులతో ముక్కు పిండి మరి వసూళ్లకు పాల్పడుతోంది. ఫలితంగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.

గత ఐదేళ్లుగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ప్రభుత్వం నుండి చెల్లింపులు కాకపోవడంతో సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 ప్రైవేటు కళాశాలలకు సుమారు 40 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది  ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యం అధ్యాపకులకు జీతాల చెల్లింపులు, నిర్వహణ భారం పెరగడంతో విద్యార్థులతో పరీక్ష ఫీజులను వసూలు చేస్తుంది.

దీంతో కొంతమంది నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించుకోలేక పరీక్షలకు దూరమవుతున్నారు.నాగర్ కర్నూ ల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏడు, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో 10 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2, 550 మంది కాగా ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 3,000 పైగా ఉన్నారు.

ఈనెల 6 నుండి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షలకు ముందస్తుగా ప్రైవేటు కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద సుమారు 10 నుంచి 20వేల వరకు డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నిరుపేద విద్యార్థులు పరీక్షకు దూరమవుతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూతపడే స్థాయిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు. !

ప్రస్తుతం ఇంటర్ ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దోస్త్ వ్బుసైట్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కానీ ప్రైవేటు కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ భారం పెరిగి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి.

ఆయా అధ్యాపకులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడంతో ఇతర కళాశాలలో ఇతర రంగాల్లో చేరుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు డిగ్రీ కళాశాల నిర్వహణ భారం కూడా అమౌంట్ పెరగడంతో కళాశాల నడపే పరిస్థితి లేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నా యి. దీంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల సంఖ్య కూడా తగ్గి ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు కూడా పెదవిరుస్తున్నారు.