ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో దోసపాటికి ఘన సన్మానం
మణుగూరు,(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్మించ నున్న తెలంగాణ భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా ఎంపికైన ప్రముఖ వ్యాపారి, ఎస్కేటీ గ్రూప్ చైర్మన్ దోసపాటి వెంకటేశ్వరరావును ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. గుట్టమల్లారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... వెంకటేశ్వరరావు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెం ట్గా సేవలందిస్తూ అనేక సామాజిక, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఉచిత అంతిమ రథ యాత్ర సేవ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన, మండలంలోని పలు ఆలయాలకు ప్రధాన దాతగా సేవలంది స్తున్న ఆయనకు ఈ బాధ్యత రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రోచ్ఛరణ లతో ఆశీర్వచనాలు అందించగా, పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో ఘనంగా సత్క రించారు.






