9 April, 2026 | 7:33 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎరువుల దుకాణాలు తనిఖీ...

17-04-2025 03:39 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఎరువుల దుకాణాలను, మల్లూరు సహకార సంఘ పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రాలను గురువారం బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అమీనా బి నిజాంసాగర్ మండలంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలు, గాయత్రి చక్కెర కర్మాగారంలో ఉన్న ఎరువుల గోదాము తనిఖీ చేశారు. యూరియా ఇతర ఎరువుల నిల్వలు, నిల్వ పట్టికలు నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు. ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన రైతులకు ఈపాస్ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఏఈ ఓ సాగర్, సీఈఓ సాయిలు, వ్యాపారులు, పాల్గొన్నారు.