ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధు సూదన్ రావు సస్పెన్షన్
19-08-2024 05:09 PM
అమరావతి: ఏపీలో ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన చేసిన పలు అవకతవకలతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని.. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు యత్నించారని జీవోలో వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని తెలిపారు. రికార్డులు ట్యాంపర్ చేశారని పేర్కొన్నారు. మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో పేర్కొన్నారు.






