03-02-2026 07:11:53 PM
తుంగతుర్తి(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన పదవ తరగతి స్నేహితుడు ఏగురి కిరణ్ మాతృమూర్తి ఏగూరి వసంత అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన దశదిన కార్యక్రమంలో 2010 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు పాల్గొని మృతులాలి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి భారీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈదురి పరశురాములు,ఇరుగు సుధాకర్,తడకమళ్ళ రవికుమార్, జటాంగి మధు, ఎస్ కే యాకూబ్ పాషా, బొజ్జ సాయికిరణ్, బరపడి సునీల్, కొమ్ము కిరణ్ మద్దెల సతీష్ తదితరులు పాల్గొన్నారు.