16 April, 2026 | 4:16 PM

Breaking News

మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన   •   నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •   మున్సిపల్‌లో పైసల పంచాయతీ   •   మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ.. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు?   •  

జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

22-06-2025 07:39 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన సౌలం కాంతారావు గత ఆరు నెలలుగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాంతారావు భార్య సమ్మక్క ఇద్దరు కూలికి వెళ్తేనే ఇల్లు గడవని దీనస్థితి.. వారి ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యపై కథనాలు వెలబడడంతో పాల్వంచకు చెందిన జనహితా ఫౌండేషన్(Janahitha Foundation) అధ్యక్షురాలు బేరా శ్రీలక్ష్మి స్పందించి స్వయంగా ఆ గ్రామం వెళ్లి వారికి రూ 10వేలు ఆర్థిక సాయం అందజేశారు.