22-06-2025 07:39:06 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన సౌలం కాంతారావు గత ఆరు నెలలుగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాంతారావు భార్య సమ్మక్క ఇద్దరు కూలికి వెళ్తేనే ఇల్లు గడవని దీనస్థితి.. వారి ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యపై కథనాలు వెలబడడంతో పాల్వంచకు చెందిన జనహితా ఫౌండేషన్(Janahitha Foundation) అధ్యక్షురాలు బేరా శ్రీలక్ష్మి స్పందించి స్వయంగా ఆ గ్రామం వెళ్లి వారికి రూ 10వేలు ఆర్థిక సాయం అందజేశారు.