22-06-2025 07:43:28 PM
జనసేన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆవుల సాగర్...
మందమర్రి (విజయక్రాంతి): కార్యకర్తల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యమని కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆవుల సాగర్(Jana Sena District Student Wing President Avula Sagar) అన్నారు. పట్టణంలోని మందమర్రి(వి) లో ఆదివారం కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను, గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. పార్టీలో క్రియాశిలక సభ్యులకు 5 లక్షల ప్రమాదభీమా, హాస్పిటల్ ఖర్చులకు 50 వేల వరకు ఆర్థిక సహాయం, కేవలం 500 రూపాయలకే 5లక్షల ప్రమాదభీమా ఇవ్వడం అనేది దేశంలో ఏ రాజకీయా పార్టీలో లేనివిధంగా పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించడం అధినేత పవన్ కళ్యాణ్ గొప్పతనం అని ఆయన కొనియాడారు.
అదే విధంగా జన సైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేకల పవన్ కళ్యాణ్, రోడ్డ శేఖర్, ఆర్చనపెల్లి చరణ్, ఆవుల శ్రావణ్, యాదగిరి ప్రసాద్, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, కిరణ్, గంగారం, శ్రీకాంత్, లక్షణ్, వేల్పుల ప్రవీణ్, వోట్ల సురేష్ లు పాల్గొన్నారు.