22-06-2025 07:27:31 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-10 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. ఆదివారం వారంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రక్షన్ ఆంజనేయులు, సుభాష్, నస్రిన్, నాగరాజు, జ్యోతి, సరిత మాణిక్యరావు, జ్యోతి, రాజ్లను ఘనంగా సన్మానించారు.