12 June, 2026 | 2:23 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక భరోసా

18-02-2026 03:24 PM

– సర్పంచ్  చింతల విజయ వెంకట్రాం రెడ్డి

శివంపేట్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రముఖ సంఘసేవకులు, కొంతాన్‌పల్లి గ్రామ సర్పంచ్  చింతల విజయ వెంకట్రాం రెడ్డి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందజేయడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, తలారి నర్సింలు – మౌనిక దంపతులకు పుట్టిన ఆడ బిడ్డ పుట్టిన సందర్భంగా రూ.5,000 మరియు బ్యాగరి సంతోష్ – నందు కిషోర్ దంపతులకు ఆడ బిడ్డ పుట్టిన  సందర్భంగా రూ.5,000లను సర్పంచ్  స్వంత నిధుల నుండి అందజేశారు.

ఆడపిల్లల భవిష్యత్తు భద్రత, విద్యాభివృద్ధి మరియు సమాన హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ సహాయం అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు సీవీర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.