15 June, 2026 | 11:25 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అగ్రస్థానంతో ముగించారు

09-10-2024 12:00 AM

పెరూ (లిమా): ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ టోర్నీని భారత్ అగ్రస్థానంతో ముగించింది. ఆఖరిరోజైన ఆదివారం కూడా మన షూటర్లు పతకాలతో సత్తా చాటారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో దీపక్ దలాల్, కమల్‌జీత్, రాజ్ చంద్రలతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది.

50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఈ త్రయం 1616 పాయింట్లు సాధించి పసిడి సొంతం చేసుకోగా.. పోటీలో దీపక్ (545 పాయింట్లు), కమల్ (543 పాయింట్లు), రాజ్ (528 పాయింట్లు) స్కోర్లు నమోదు చేశారు. ఇక అజర్‌బైజాన్ (1615 పాయింట్లు), ఆర్మేనియా (1612 పాయింట్లు) షూటర్లు రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.

వ్యక్తిగత ఈవెంట్‌లో భారత షూటర్ ముకేశ్ నెలవల్లి కాంస్యంతో మెరవగా.. జూనియర్ మహిళల 50 మీ విభాగంలో పరిశా గుప్తా (540 పాయింట్లు) రజతం నెగ్గింది. మొత్తంగా టోర్నీలో 24 పతకాలు సొంతం చేసుకున్న భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, మూడు రజతాలు, 8 కాంస్యాలున్నాయి. తొలి స్థానంలో భారత్ నిలవగా.. ఇటలీ, నార్వే రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.