15 July, 2026 | 11:20 AM

ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

15-07-2026 11:19 AM

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని(Parawada Pharma) ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని శ్రీ సాయి చందన ఫార్మా ప్రొడక్షన్ బ్లాక్-2లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ మంటలు భవనాన్ని చుట్టుముట్టగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 12 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గంటల తరబడి సాగిన అగ్నిమాపక చర్యల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న 40 మంది కార్మికులూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణం, జరిగిన నష్టం తీవ్రత ఇంకా నిర్ధారించబడలేదని అధికారులు పేర్కొన్నారు.