calender_icon.png 13 June, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఇంజన్ లో నుంచి చెలరేగిన మంటలు

23-04-2025 09:04:30 AM

మంటలు అదుపు చేసిన ఫైర్ ఇంజన్

ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ఘటన

ఇబ్రహీంపట్నం: సాంకేతిక లోపంతో ఓ లారీ ఇంజన్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి, లారీ తగలబడ్డ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మాటూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బండలు రవాణా చేస్తున్న లారీ ఇబ్రహీంపట్నం చెరువు కట్ట పైకి రాగానే లారీ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ లారీలో నుంచి కిందకు దూకి ప్రాణప్రాయం నుంచి తప్పించుకొని  పారిపోయాడు. స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఫైర్ ఇంజన్ లతో వెళ్లి తగలబడ్డ లారీ మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.