23-04-2025 09:01:57 AM
రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు..
ద్వితీయ బైపీసీలో 991 మార్కులు సాధించిన మానస..
అభినందించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్..
వైరా, విజయక్రాంతి: వైరాలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇంటర్ ఫలితాల్లో తమ సత్తాను చాటి రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు.. ప్రైవేటు విద్యను సైతం అధిగమిస్తూ.. వారి కంటే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వైరా గురుకుల కళాశాలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్నారు.. ద్వితీయ సంవత్సరం ఇంటర్ బైపీసీ విభాగంలో డి. మానస అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించింది.. మరో విద్యార్థి బి.గౌతమి 983 మార్కులు సాధించారు అంతేకాక ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగం లో ఎస్ భవిత అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 989 మార్కులు,ఏ స్వాతి 987 మార్కులు సాధించారు.. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగం లో ఎం స్రవంతి అనే 440 మార్కులు గాను 437 మార్కులు అంతేకాక ఇ. సాత్విక 436 మార్కులు సాధించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్ సంజన 470 మార్కులు గాను 466 మార్కులు షేక్ కరిష్మా 465 మార్కులు సాధించి గురుకులంలో మెరిసిన ఆణిముత్యాలుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా ను విద్యార్థినిల తల్లిదండ్రులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్..
రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన వైరా రెసిడెన్షియల్ గురుకుల కళాశాల విద్యార్థులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేకంగా అభినందించారు.. ఉత్తమ ప్రతిభ కనపరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. విద్యార్థులను శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ రమా తో పాటు అధ్యాపకులు సంధ్యా స్వప్న శ్వేత కోటేశ్వరరావు సతీష్ లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో మరెన్నో ఉత్తమ ఫలితాలు సాధించాలని కన్న తల్లిదండ్రులకు ప్రాంతానికి దేశానికి వైరాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి ఏదునూరి సీతారాములు పమ్మి అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు