15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం

23-06-2025 12:27 AM

భారీగా ఆస్తి నష్టం!

రాజేంద్రనగర్, జూన్ 22: ఓ ఫర్నిచర్ గోదాం లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీ స్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం అలీ భాయ్ మసీదు సమీపంలో ఆదివారం ఉద యం మారు 9 గంటలకు జరిగింది. ఎస్త్స్ర విశ్వనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ కే జి ఎన్ గోడౌన్ లో యజమాని జహంగీర్ ఫర్నిచర్ నిల్వ ఉంచాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు గోదాంకు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడానికి సమయం పట్టింది.

ఇలా ఉండగా గోదాం లో నుంచి కొంత భాగం మరో ప్రాంతానికి ఫర్నిచర్ తరలించామని యజమాని జహంగీర్ తెలిపాడు. ఆస్తి ఎంత మేరా నష్టం జరిగిందో అనే వివరాలు తెలియ రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.