23-06-2025 12:27:30 AM
-మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 22 (విజయ క్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కొత్త టెక్నాలజీతో కూడిన విద్యను ఉపాధ్యాయులు అందించాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం పి ఆర్ టి యు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓం కన్వెన్షన్ నందు పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
గత విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 43 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోర్డులలో కంటెంట్ ఫీడ్ చేయడం జరిగిందని, గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గం లోని పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా 2డి,3డి యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
10 % విద్యార్థులు మంచి మార్కులు సాధించడం ముఖ్య కాదని, మరి 90% విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. అనంతరం మహబూబ్నగర్ లో ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న పాటల పల్లకిలోనా 24 గంటలు పాలమూరులో అనే కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓబెదుల్ల కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్, జిల్లా పిఆర్టీయు అధ్యక్షులు మధన్ మోహన్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపనోళ్ళ సుధాకర్ రెడ్డి, గట్ట వెంకట్ రెడ్డి, పిఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి, సిఎంఓ బాలు యాదవ్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.