14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై కాల్పులు

04-12-2024 10:41 AM

అమృత్‌సర్: శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల 'సేవాదర్' విధులు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గోడకు తగలడంతో వీల్ చైర్‌లో కూర్చున్న బాదల్ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. స్వర్ణ దేవాలయం వెలుపల నిలబడిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపిన వ్యక్తిపై దాడి చేశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది అయిన నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. ఇప్పటికే అతనిపై అనేక కేసులున్నట్లు సమాచారం. సంఘటన జరిగిన సమయంలో, నరేన్ సింగ్ చౌరా సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు దగ్గరగా నిలబడి ఉన్నాడు. సుఖ్‌బీర్ బాదల్‌పై కాల్పులు జరిపినప్పుడు గురి తప్పడంతో సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు ప్రాణపాయం తప్పింది. కాల్పులు జరుపుతున్న దుండగుడిని బాదల్ అనుచరులు అడ్డుకున్నారు.