ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు
తెలంగాణ కీలక ప్రాజెక్టులపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో(Union Ministers) రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 9.45 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహకార అంశాలపై కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్తో మెట్రో విస్తరణ, కింజరాపు రామ్మోహన్ నాయుడుతో విమానాశ్రయాల అభివృద్ధి, నితిన్ గడ్కరీతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.






